పబ్లిక్ ఇష్యూ బాటపట్టిన జొమాటో

ఫుడ్ డెలివరీ సంస్ధ అయిన జొమాటో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. తద్వారా దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలో తొలిసారి లిస్టయిన ఆధునిక ఇంటర్నెట్ వినియోదారు సంస్థగా నిలిచే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇది వరకు  2019 జూన్ మాసంలో  బీటూబీ ఆన్లైన్ కంపెనీ ఇండియామార్ట్ ఇంటర్మెష్ మార్కెట్లో లిస్టయ్యింది. ఇంటర్నెట్ ఆధారిత సేవలందించే ఇతర  సంస్థలతో పరిగణిస్తే.. 2006లో ఇన్ఫో ఎడ్జ్, 2013లో జస్ట్ డయల్ పబ్లిక్ ఇష్యూలను విజయవంతంగా ముగించాయి. జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్ ఇన్వెస్ట్ చేసిన విషయం అందరికి విదితమే. కాగా.. 2010లో ఆన్ లైన్ ట్రావెల్ సేవల సంస్థ  మేక్ మై ట్రిప్.. నాస్డాక్ లో లిస్టింగ్ సాధించింది.

కోటక్ మహీంద్రా

పబ్లిక్ ఇష్యూకి మర్చంట్ బ్యాంకుగా కొటక్ మహీంద్రాను జొమాటో ఎంపిక చేసుకున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఇష్యూకి న్యాయ సలహాదారులుగా సైరిల్ అమర్చంద్ మంగళ్దాస్, ఇండస్ లా సేవలందించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దేశీయంగా దిగ్గజ కంపెనీలుగా ఆవిర్భవించిన ఫ్లిప్ కార్ట్, పేటీఎమ్, బిగ్ బాస్కెట్ సైతం భవిష్యత్ లో పబ్లిక్ ఇష్యూలు చేపట్టే యోచనలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా . ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోలో.. ఇప్పటికే ఇన్ఫో ఎడ్జ్, టెమాసెక్, యాంట్ ఫైనాన్షియల్, టైగర్ గ్లోబల్ తదితర సంస్థలు ఇన్వెస్టర్లుగా వున్న విషయం విదితమే.

దేశీ మార్కెట్ ఓకే

విదేశీ లిస్టింగ్ కాకుండా దేశీయంగానే ఐపీవో చేపట్టాలని జొమాటో నిర్ణయించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగానూ విజయవంతమైన సంస్థలకి  తగిన ధర లభిస్తుండటమే దీనికి ప్రధాన కారణమని వివరించారు. టెక్నాలజీ, ఇంటర్నెట్ సంస్థల  పట్ల పలు దేశాల ఇన్వెస్టర్లు సైతం ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలియజేశారు. 2019 జులై నెలలో రూ. 973 ధరలో ఐపీవోకు వచ్చిన ఇండియామార్ట్ ఇంటర్మెష్ ప్రస్తుతం రూ. 4891కు చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సంస్థ మార్కెట్ విలువ రూ. 14,240 కోట్లను తాకడం గమనార్హం. కాగా.. చివరిసారిగా నిధుల సమీకరణను పరిగణిస్తే జొమాటో విలువ 3.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయితే హెచ్ ఎస్బీసీ 5 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *