యూపీఐ లావాదేవీల జోరు

కోవిడ్‌కు ముందున్న స్థాయితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో యూపీఐ లావాదేవీలు విలువ, పరిమాణం పరంగా 1.7 రెట్లు అధికమయ్యాయని ఎస్‌బీఐ వెల్లడించింది. అన్‌లాక్‌ తదనంతరం అయిదు నెలల కాలంలో భారత్‌లో వివిధ రంగాల్లో నెలకొన్న పరిస్థితులపై ఎస్‌బీఐ పరిశోధన నివేదికను విడుదల చేసింది. ఎస్‌బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ రాసిన ఈ నివేదిక ప్రకారం.. సెప్టెంబరు నెలలో ఋణాలు సంఖ్య పెరిగినప్పటికీ అక్టోబరు నెలలో ఆ ఊపును  అందుకోలేకపోయింది. రుణాల వృద్ధి రేటు  5.1 శాతంగా  నమోదైంది. గతేడాది ఇది 8.9 శాతం. రెండవ త్రైమాసికంలో బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. సూక్ష్మ ఋణ సంస్థలు సైతం మెరుగైన పనితీరు కనబరిచాయి. మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తులు తగ్గాయి. హామీ లేని

ఋణాలు 2020 సెప్టెంబరు నెలతో పోలిస్తే అక్టోబరు నెలలో 48 శాతం తగ్గి, రూ.1.02 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్ నెల‌తో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల్లో మ్యూచువల్‌ ఫండ్ల వాటా రూ.6,554 కోట్లు తగ్గి, సెప్టెంబరు మాసంలో రూ.47,678 కోట్లకు దిగొచ్చాయి. అక్టోబరు మాసంలో జీఎస్టీ ఆదాయం గతేడాది ఇదే నెలతో పోలిస్తే 10 శాతం అధికమైంది. ఈ–వే బిల్లులు రికార్డు స్థాయిలో సెప్టెంబరులో 5.74 కోట్లుగా  నమోదైతే, అక్టోబరులో ఈ సంఖ్య 6.42 కోట్లకు ఎగబాకాయి. అత్యవసర వస్తువులు తయారు చేసే కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించాయి. అత్యవసరం కాని ఉత్పత్తులు, సేవల్లో ఉన్న కంపెనీల ఆదాయం బలహీనపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *